ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడ నగరములో ఉంది. ఈ పర్వతము మీద అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపదించాడని ప్రతీతి. ఇక్కడే అర్జునుడు శివపార్వతులతో యుధ్దం చేసాడని నమ్మకం. ఆ స్థలం లోనె కనకదుర్గ ఆలయం వెలసిందని నమ్మకం. స్ధానికంగా వాడుకలో ఉన్న కథనం ప్రకారం, అసలు ఆలయం కొండ మీద ఉందని, సామాన్య మానవులకు కనిపించదని, ఇప్పుడు వున్న ఆలయం మానవుల కోసం నిర్మించబడిందని అంటారు.ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకూ విస్తరించి ఉండేదనీ, చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదనీ ఓ కథనం. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో...కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందనీ ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందనీ చరిత్రకారులు చెబుతారు. అందుకే, బెజవాడను మొదట్లో 'బెజ్జంవాడ' అని పిలిచేవారట. ఆరోజుల్లో, ఇంద్రకీలాద్రికి వెళ్లడానికి కనీసం నడకదారి కూడా ఉండేది కాదట 1906 నాటికి ఇక్కడో చిన్నగుడి ఉన్నట్టు తెలుస్తోంది. అభిషేకాలూ అర్చనలూ లేవు కానీ, దీపం మాత్రం వెలిగించేవారు. క్రూరమృగాల బారిన పడతామేమో అన్న భయంతో అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఇంద్రకీలాద్రికి వచ్చేవారట. 1992 ప్రాంతంలో కొండపైకి రహదారి ఏర్పాటైంది. ఆలయం చుట్టూ రాతికట్టడం నిర్మించారు. 2002లో ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగారు. గతంతో పోలిస్తే, 1990 నుంచీ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
కృష్ణా జిల్లాలో ఇంద్రకీలాద్రి కొండ ఎక్కడ ఉంది?
Ground Truth Answers: విజయవాడవిజయవాడవిజయవాడ
Prediction: